MS Dhoni: ప్రముఖ పురుష క్రికెటర్లు మహిళలుగా మారితే.. ఇలా ఉంటారు..!

  • ప్రముఖ క్రికెటర్లను ఏఐ సాయంతో మహిళలుగా మార్చిన వైనం
  • మిడ్ జర్నీ సాయం తీసుకున్న ఓ ఆర్టిస్ట్
  • సరదాకు తోడు టెక్నాలజీ పనితనాన్ని తెలియజెప్పడమే ఉద్దేశ్యం
MS Dhoni rohit sharma heres how AI thinks cricketers would look like as women

ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. ఏ సమాచారం కావాలన్నా చాట్ జీపీటీ క్షణాల్లో అందిస్తుంది. అలాగే, మిడ్ జర్నీ అనేది కూడా ఓ రీజనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్. ఈ పోర్టల్ ప్రత్యేకత ఏమిటంటే ఏఐ సాయంతో ఫొటోలను మనకు కావాల్సిన విధంగా మార్చేయగలదు. ప్రస్తుతానికి మిడ్ జర్నీ సేవలు పూర్తిగా  చెల్లించి పొందేవి మాత్రమే. ఆర్టిస్ట్ ఎస్కే ఎండీ అబూ మిడ్ జర్నీ సాయంతో భారతీయ క్రికెటర్లు మహిళలుగా అయితే ఎలా ఉంటారు? అన్నది మిడ్ జర్నీ సాయంతో ఫొటోలు పొందారు. వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అంతేకాదు మహిళలుగా కనిపిస్తున్నందుకు వారి పేర్లలోనూ మార్పులు చేశారు. 

రవీనా జడేజా
 మహీసింగ్ ధోనీ
 రోహిణి శర్మ
 హర్షాలి పాండ్యా
  సుభద్ర గిల్

More Telugu News