Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ దే విజయం: లోక్ పోల్ సర్వే వెల్లడి

  • ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు
  • ఈరోజుతో ముగియనున్న ప్రచారపర్వం
  • కాంగ్రెస్ కు 129 నుంచి 134 స్థానాలు వస్తాయన్న సర్వే
Lok Poll survey predicts Congress win in Karnataka

దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈరోజుతో ప్రచార పర్వం ముగుస్తోంది. ఈ నెల 10న పోలింగ్ జరగబోతోంది. మరోవైపు పలు ఎన్నికల సర్వేలు ఈసారి అధికారం కాంగ్రెస్ దే అని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా లోక్ పోల్ సర్వే తన ఫలితాలను వెల్లడించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజం సాధిస్తుందని సర్వే తేల్చి చెప్పింది. 

సర్వే ఫలితాల్లో హైలైట్స్:

  • కాంగ్రెస్ పార్టీ 129 నుంచి 134 స్థానాలు గెలుపొందే అవకాశం. 
  • 59 నుంచి 65 సీట్లకే పరిమితం కానున్న బీజేపీ. 
  • జేడీఎస్ కు 23 నుంచి 28 స్థానాలు వచ్చే అవకాశం. 
  • కాంగ్రెస్ కు 42 నుంచి 45 శాతం వరకు ఓట్లు పడే అవకాశం. 
  • బీజేపీ ఓట్ల శాతం 36 నుంచి 32 శాతానికి పడిపోతాయి.

More Telugu News