Yadadri Temple: యాదాద్రి ఆలయంపై డ్రోన్‌ ప్రయోగం

  • యాద్రాద్రిలో డ్రోన్ కలకలకం
  • యాదాద్రి ఆలయంపై డ్రోన్ ప్రయోగించిన ఇద్దరు యువకులు
  • యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, డ్రోన్ సీజ్
  • నిందితులిద్దరూ హైదరాబాద్ వాసులుగా గుర్తింపు
Telangana youth launces drone over Yadadri temple

యాదాద్రిలో తాజాగా డ్రోన్ కలకలం రేగింది. యాదాద్రి ఆలయంపై డ్రోన్ ప్రయోగించిన ఇద్దరు యువకులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. యువకులిద్దరూ హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యువకులు డ్రోన్ ఎందుకు ప్రయోగించారో తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక డ్రోన్ వినియోగానికి సంబంధించి కేంద్రం సవివరమైన నిబంధనలు రూపొందించింది. యూజర్లు తమ పేరు, డ్రోన్ వివరాలను డిజిటల్ స్కై ప్లాట్‌ఫాంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాటికి ప్రత్యేక యూఐఎన్ సంఖ్య, యూఏఓపీ లైసెన్స్‌ను కేటాయిస్తారు.

More Telugu News