Karnataka: కిచ్చా సుదీప్ నిర్ణయంతో హర్టయ్యా: ప్రకాశ్ రాజ్

Prakash raj he is hurt by kichcha sudeep decision to support bjp
షార్ట్స్‌లో చూడండి
కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ అధికార బీజేపీకి మద్దతు తెలపడం సంచలనంగా మారింది. దీనిపై తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. సుదీప్ నిర్ణయం తనను విస్మయపరిచిందని, తన మనసు గాయపడిందని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో మంచి ఫాలోయింగ్ ఉన్న కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతుగా నిలవడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. 

అంతకుమునుపు సుదీప్..  కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో సీఎంతో కలిసి పాల్గొన్న ఆయన వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని చెప్పారు. 

ఈ పరిణామంపై పలువురు కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. బీజేపీ ఎవరినైనా ప్రభావితం చేయగలుగుతుందని ఎంపీ, కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జ్ రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. అయితే ఆరున్నర కోట్ల కన్నడ ప్రజలే ఎన్నికలను ప్రభావితం చేస్తారని చెప్పారు.
Go Back to Shorts
Karnataka
Prakash Raj

More Telugu News