Jagan: ఈరోజు ఢిల్లీకి వెళ్తున్న జగన్.. 14 రోజుల వ్యవధిలో హస్తినకు రెండోసారి!

Jagan going to Delhi for second time in last 14 days
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన బయల్దేరుతారు. సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. రేపు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను జగన్ కలవనున్నారు. హుటాహుటిన ఆయన ఢిల్లీకి వెళ్తుండటంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. 

గత 14 రోజుల్లో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తుండటం ఇది రెండోసారి. ఈ నెల 16న ఆయన ఢిల్లీకి వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలను కూడా పక్కన పెట్టి ఆయన అప్పుడు ఢిల్లీకి వెళ్లారు. 17న మోదీ, అమిత్ షాను కలిశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి చర్చించడానికే ఢిల్లీకి వెళ్లానని జగన్ చెప్పారు. ఇప్పుడు విశాఖలో జీ-20 సదస్సు జరుగుతున్న తరుణంలో ఆ కార్యక్రమాన్ని పక్కనపెట్టి ఢిల్లీకి వెళ్తుండటంపై ఆసక్తి నెలకొంది. జగన్ కు మోదీ, అమిత్ షా ల అపాయింట్ మెంట్లు ఇప్పటికే ఖరారయ్యాయి.
Go Back to Shorts
Jagan
YSRCP
Delhi
Narendra Modi
Amit Shah
BJP

More Telugu News