వైద్య ఖర్చులు భరించలేక యువకుడి ఆత్మహత్య..
- దీర్ఘకాలిక వ్యాధితో ఢిల్లీ యువకుడు సతమతం
- తడిసిమోపడవుతున్న వైద్య ఖర్చులు
- తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆత్మహత్యకు నిర్ణయం
- నొప్పి తెలియకుండా ఆత్మహత్య చేసుకునే మార్గాల కోసం ఆన్లైన్లో సెర్చింగ్
- చివరకు ఆక్సిజన్ పాయిజనింగ్ ద్వారా బలవన్మరణం
కాగా.. నితీశ్ రాసిన ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. దీర్ఘకాలిక అనారోగ్యం.. తడిసిమోపెడవుతున్న ఆసుపత్రి ఖర్చులు తనను మానసికంగా కుంగదీసినట్టు యువకుడు తన లేఖలో పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు వెల్లడించాడు. అయితే.. నొప్పి లేకుండా ఆత్మహత్య ఎలా చేసుకోవాలో తెలుసుకునేందుకు అతడు ఆన్లైన్లో వెతికినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ పాయిజనింగ్ గురించి అతడికి తెలిసిందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఆన్లైన్లో పలువీడియోలు కూడా చూసినట్టు పేర్కొన్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.