Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్ అన్నారు... ఇప్పుడు తూచ్ అంటున్నారు: లోకేశ్​

  • కదిరి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • 600 కిమీ మార్కు చేరుకున్న యువగళం
  • చిన్నయల్లంపల్లి వద్ద టెంపుల్ టూరిజం సర్క్యూట్ హామీ ఇచ్చిన లోకేశ్
  • యువగళం దెబ్బకు జగన్ కు మైండ్ బ్లాంక్ అయిందని ఎద్దేవా
Lokesh take swipe at CM Jagan and YCP leaders

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 47వ రోజు (ఆదివారం) కదిరి నియోజకవర్గం నల్లచెరువు శివార్లలో 600 కిలోమీటర్ల మార్కును చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్న ఆనందంతో కేరింతలు కొట్టారు. 

పాద‌యాత్ర 600 కి.మీ చేరుకున్న సంద‌ర్భంగా చిన్నయ‌ల్లంప‌ల్లి వ‌ద్ద‌ టెంపుల్ టూరిజం స‌ర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ ప‌థ‌కంలో భాగంగా కటారుపల్లె వద్ద వేమన సమాధి, గొటిబాయిలు గ్రామంలో తిమ్మమ్మ మర్రిమాను, చెర్లోపల్లి రిజర్వాయర్ బోటింగ్, బట్రేపల్లె వాటర్ ఫాల్స్ , శ్రీ ఖాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యాన్ని అభివృద్ధి చేస్తారు. టీడీపీ ప్రభుత్వం రాగానే కార్యాచ‌ర‌ణ ప్రారంభిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. 

సాయంత్రం జొన్నపేటలో జరిగిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీఎత్తున ప్రజలు హాజరయ్యారు.

లోకేశ్ మాటల తూటాలు...

  • అధికార మదం తలకెక్కి నా వెంట్రుక కూడా పీకలేరు అన్నావ్... ప్రజలు ఏకంగా నీకు గుండు కొట్టించారు.
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు సైకోపాలనపై ప్రజావిజయం.
  • యువగళం దెబ్బకు జగన్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది.
  • ఇది ట్రైలర్ మాత్రమే... అసలు సినిమా 2024లో చూపిస్తాం.
  • రాబోయే ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం.
  • ఎన్నికల ముందు సెమీఫైనల్స్ అన్నవాళ్లు... ఫలితాలు వచ్చాక తూచ్ అనడం హాస్యాస్పదంగా ఉంది.
  • గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పదవికి పదో తరగతి ఫెయిల్ అయిన వాళ్లను వైసీపీ నిలబెట్టింది. 108 నియోజకవర్గాల యువత వైసీపీని ఛీ కొట్టారు.
  • అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన దాఖలాలు చరిత్రలో మనం చూడలేదు... కానీ వైసీపీ ఆరోపించింది. 
  • వై నాట్ 175 అంటున్న జగన్ రెడ్డికి... బైబై జగన్ అంటూ యువత తీర్పునిచ్చారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తికి తగిన గుణపాఠమే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు.
  • ఎన్నిచేసినా ప్రజలు భారీ మెజారిటీతో టీడీపీకి అనుకూలంగా తీర్పుచెప్పారు. 
  • 151 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పనికిమాలిన సీఎం జగన్. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఒకటే స్లోగన్, సైకోపోవాలి...సైకిల్ రావాలి. 
  • ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ని జగన్ దుర్వినియోగం చేశాడు. ఏపీ రాజధానితో  మూడు ముక్కలాట ఆడిన జగన్ కు మూడు మొట్టికాయలతో బుద్ధిచెప్పారు.
  • మైండ్ ఉన్న వాడు ఎవడైనా సింగపూర్, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటాడు. మన సీఎం మాత్రం ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్నాడు. ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన ప్రారంభిస్తారు. సైకో సీఎం ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించాడు.
  • సీఎం అయిన తరువాత ఎవరైనా మొదట చేసే పని పరిశ్రమలు తీసుకురావడం. కానీ ఫెయిల్డ్ సీఎం కథ వేరు... ఈయన సీఎం అయిన వెంటనే పీపీఏ లు రద్దు చేసి ఉన్న కంపెనీలను తరిమేసాడు.
  •  సీఎం అయ్యాక ఎవరైనా అభివృద్ధి, సంక్షేమంలో పోటీపడతారు. మన ఫెయిల్డ్ సీఎం జగన్ మాత్రం కేవలం ప్రతిపక్షంపై కక్ష సాధింపు ఎజెండాగా పెట్టుకున్నాడు.
  • జగన్ రాయలసీమ బిడ్డ అని ప్రచారం చేసుకున్నాడు. ఆయన రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ. కడప ఉక్కు ఫ్యాక్టరీకి రెండుసార్లు చేసిన శంకుస్థాపన కోసం సొంత మీడియాకి 30 కోట్లు ప్రకటనలు ఇచ్చాడు. 
  • 30 పైసలు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఖర్చు చెయ్యలేదు. 
  • కియా కారు చూస్తే అనంతపురం గుర్తుకు వస్తుంది. దటీజ్ చంద్రబాబు గారు. డ్రిప్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు ఇలా ఏమి చూసినా చంద్రబాబు గారు గుర్తుకు వస్తారు. 
  • జగన్ కి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. అనంతపురంకి నువ్వు తెచ్చిన ఒక్క కంపెనీ ఉందా?ఒక్క అభివృద్ధి కార్యక్రమం నువ్వు చేసావా? 
  • మహిళల్ని మోసపూరిత హామీలిచ్చి ముంచేశాడు ఫెయిల్డ్ సీఎం జగన్. ఉద్యోగస్తులకు వారంలో పెన్షన్ రద్దు అన్నాడు. పోలీసులకు వీక్లీ ఆఫ్ అన్నాడు. ఫెయిల్డ్ సీఎం జగన్ ఇప్పుడు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి. 
  • కదిరి ఎమ్మెల్యే గారి పేరు సిద్ధారెడ్డి. ఆయన ప్రజల సొమ్ము కొట్టేయడంలో సిద్దహస్తుడు. 
  • నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో 50 వేల రూపాయలకు మించి ఏ కాంట్రాక్ట్ అయినా సరే సిద్ధారెడ్డి కంపెనీకే పనులు దక్కుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాలు మొత్తం సిద్ధారెడ్డికి చెందిన కంపెనీకే కట్టబెట్టారు. 
  • రోడ్డు వేయలేని వాడు కాంట్రాక్టు ఎందుకు తీసుకోవాలి? జనాల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి. గ్రామాల్లో రోడ్లు వేయని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కదిరిలో తన అపార్ట్ మెంట్ కు మాత్రం 50 లక్షలు పెట్టి రోడ్డు వేసుకున్నారు. 
  • ఖాద్రీ నరసింహుడు కోనేరులోకి మురుగునీరు రాకుండా ఉండటం కోసం రూ.2 కోట్ల 30 లక్షలతో మోడర్నైజేషన్ పనులు అనంతపురానికి చెందిన కంపెనీకి అప్పగించి ఎమ్మెల్యే రూ.2 కోట్లు కొట్టేశాడు.

======

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 602.7 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 11.7 కి.మీ.*

*యువగళం పాదయాత్ర 48వ రోజు షెడ్యూల్ (20-3-2023)*

*కదిరి నియోజకవర్గం (శ్రీ సత్యసాయి జిల్లా).*

ఉదయం

8.00 – జోగన్నపేట విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.45 – మోటుకుపల్లి వద్ద అనాధలతో మాటామంతీ.

10.20 – మోటుకుపల్లి పీవీఆర్ గ్రౌండ్ లో బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.

11.20 – మోటుకుపల్లిలో భోజన విరామం.

మధ్యాహ్నం

2.20 – మోటుకుపల్లి భోజన విరామస్థలంలో ముస్లింలతో ముఖాముఖి.

సాయంత్రం

4.20 – కదిరి ఇక్బాల్ సర్కిల్ (జీవమాను సర్కల్) లో స్థానికులతో మాటామంతీ.

4.45 – కదిరి ఎంజీ రోడ్డులో జ్యుయలరీ షాపు యజమానులతో భేటీ.

5.00 – కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు.

7.10 – కదిరి ఆర్డీఓ కార్యాలయం వద్ద విడిది కేంద్రంలో బస.


=====

More Telugu News