Team India: వైజాగ్ వన్డేలో స్టార్క్​ దెబ్బకు భారత్​ విలవిల.. 16 ఓవర్లకే ఆరుగురు ఔట్

  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
  • నాలుగు వికెట్లు పడగొట్టిన స్టార్క్
  • గిల్, రోహిత్, రాహుల్, సూర్య, హార్దిక్ పెవిలియన్ దారి
  • కోహ్లీని అవుట్ చేసిన నాథన్ ఎల్లిస్
India lose five wickets early

టెస్టు సిరీస్‌ చేజిక్కించుకొని, తొలి వన్డేలో ఉత్కంఠ విజయం సాధించి వైజాగ్ కు వచ్చిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో బ్యాటింగ్ తో తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. ఆస్ట్రేలియా స్టార పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు వణికిపోతోంది. పది ఓవర్లకు కూడా ముగియకముందే.. యాభై పరుగుల్లోనే సగం వికెట్లు కోల్పోయింది. ఇందులో నాలుగు మిచెల్ స్టార్క్ కే పడ్డాయి.

ఇన్నింగ్స్ మూడో బంతికే శుభ్ మన్ గిల్ (0) ఔటవగా.. ఐదో ఓవర్లో వరుస బంతుల్లో రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్ (0) వెనుదిరిగారు. ఆపై తొమ్మిదో ఓవర్లో కేఎల్ రాహుల్ (9)ను కూడా స్టార్క్ ఎల్బీగా వెనక్కు పంపాడు. సీన్ అబాట్ వేసిన తర్వాతి ఓవర్లోనే స్లిప్ లో స్టీవ్ స్మిత్ పట్టిన అద్భుత క్యాచ్ కు హార్దిక్ పాండ్యా (1) సైతం పెవిలియన్ చేరడంతో 49 పరుగులకే భారత్ సగం వికెట్లు కోల్పోయింది. 

ఆ తర్వాత, ఎంతో జాగ్రత్తగా ఆడుతున్న కోహ్లీ కూడా వికెట్ చేజార్చుకున్నాడు. 31 పరుగులు చేసిన కోహ్లీని నాథన్ ఎల్లిస్ అవుట్ చేశాడు. దాంతో భారత్ ఆరో వికెట్ చేజార్చుకుంది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 17 ఓవర్లలో 6 వికెట్లకు 73 పరుగులు కాగా... జడేజా (12 బ్యాటింగ్), అక్షర్ పటేల్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

More Telugu News