Cheteshwar Pujara: ఆస్ట్రేలియాపై 2 వేల పరుగులు... దిగ్గజాల సరసన పుజారా

  • అరుదైన ఘనత అందుకున్న పుజారా
  • ఆసీస్ పై టెస్టుల్లో 2 వేల పరుగులు సాధించిన సచిన్, లక్ష్మణ్, ద్రావిడ్
  • అహ్మదాబాద్ టెస్టులో ఆసీస్ పై 42 పరుగులు చేసిన పుజారా
  • 24 టెస్టుల్లో 2 వేల పరుగులు చేసిన వైనం
Puajara completes 2000 test runs against Australia

టీమిండియా టెస్టు జట్టులో నిలకడకు మారుపేరుగా నిలిచే ఛటేశ్వర్ పుజారా అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అహ్మదాబాద్ టెస్టులో పుజారా 42 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించుకున్నాడు. 

ఆస్ట్రేలియాపై టెస్టుల్లో ఇప్పటివరకు భారత్ తరఫున సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ మాత్రమే 2 వేల పరుగుల ఘనత అందుకున్నారు. ఇప్పుడు పుజారా కూడా దిగ్గజాల సరసన చేరాడు. పుజారా ఈ ఘనతను 24 టెస్టుల్లో అందుకున్నాడు.

More Telugu News