Mumbai Indians: ఎదురులేని ముంబయి ఇండియన్స్... ఢిల్లీ క్యాపిటల్స్ పై ఈజీ విక్టరీ

  • డబ్ల్యూపీఎల్ లో ముంబయికి హ్యాట్రిక్ విక్టరీ
  • ఢిల్లీపై 8 వికెట్లతో విజయం
  • రాణించిన యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్
  • పాయింట్ల పట్టికలో ముంబయి అగ్రస్థానం పదిలం
Mumbai Indians unbeatable in WPL

డబ్ల్యూపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ముంబయి అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. 

ఢిల్లీ విసిరిన 106 పరుగుల లక్ష్యాన్ని ముంబయి 15 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ యస్తికా భాటియా 32 బంతుల్లో 8 ఫోర్లతో 41 పరుగులు చేయగా, మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్ 32 పరుగులు చేసింది. వీరిద్దరూ అవుటైన తర్వాత నాట్ షివర్ (23), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (11) జోడీ మరో వికెట్ పడకుండా పని పూర్తి చేసింది. అలిస్ కాప్సే 1, తారా నోరిస్ 1 వికెట్ తీశారు. 

ఈ టోర్నీలో ముంబయి ఇండియన్స్ కు ఇది హ్యాట్రిక్ విజయం. దాంతో పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలపరుచుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 18 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

More Telugu News