హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- ఇంజినీర్ అజ్మీరా భద్రయ్య అనే వ్యక్తి ఫోన్ చేసినట్టు గుర్తింపు
- విమానాశ్రయానికి లేట్ గా రావడంతో అనుమతించని ఎయిర్ లైన్స్ సిబ్బంది
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
మరోవైపు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎయిర్ పోర్టులోనే ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. చెన్నైలో సీనియర్ ఇంజినీర్ గా పని చేస్తున్న అజ్మీరా భద్రయ్య అనే వ్యక్తి ఈ కాల్ చేసినట్టు గుర్తించారు. విమానాశ్రయానికి ఆయన లేట్ గా రావడంతో ఆయనను ఎయిర్ లైన్స్ సిబ్బంది అనుమతించలేదు. దీంతో, ఆయన ఈ బెదిరింపు కాల్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు.