Nagababu: మహాసేన రాజేష్ గురించి జనసైనికులు ఎవరూ తప్పుగా మాట్లాడకండి: నాగబాబు

  • టీడీపీలో చేరనున్న మహాసేన రాజేష్
  • ఈ నెల 16న ముహూర్తం
  • పెద్దాపురంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సన్నాహాలు
  • ఇటీవల జనసేనలో చేరతాడంటూ ప్రచారం 
Nagababu says do not talk about Mahasena Rajesh

దళిత వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న మహాసేన రాజేష్ ఈ నెల 16న చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా చంద్రబాబు పెద్దాపురం రానున్నారు. ఈ సందర్భంగా మహాసేన రాజేష్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన తొలుత జనసేనలోకి వెళతారని ప్రచారం జరిగింది. అయితే, టీడీపీలో చేరుతున్నట్టు ఇటీవల ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు. మహాసేన రాజేష్ గురించి జనసైనికులు ఎవరూ తప్పుగా మాట్లాడకండి అంటూ ట్వీట్ చేశారు. అతను ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాడనేది అతని ఇష్టం... అది తన ప్రజాస్వామ్య హక్కు అని నాగబాబు స్పష్టం చేశారు. అతడి నిర్ణయం ఎలాంటిదైనా గౌరవించాలని, అతడికి శుభాకాంక్షలు తెలపాలని సూచించారు.

More Telugu News