Azmet Jah: తొమ్మిదవ నిజాంగా అజ్మత్ జా ఎంపిక

  • నిజాం వారసుడిగా ముకర్రమ్ జా కుమారుడు అజ్మత్ జా ఎంపిక
  • లండన్ లో పుట్టి పెరిగిన అజ్మత్ జా
  • ఫొటోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్న అజ్మత్ జా
Azmet Jah elected as Nizam IX

హైదరాబాద్ నిజాం వారసుడిగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీఖాన్ అజ్మత్ జా ఎంపికయ్యారు. చివరి నిజాం ముకర్రమ్ జా ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో నిజాం వారసుడిగా, తొమ్మిదవ నిజాంగా అజ్మత్ జాను కుటుంబసభ్యులు ఎంపిక చేశారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, నిజాం ట్రస్టీల మధ్య సాంప్రదాయ పద్ధతిలో ప్రక్రియను నిర్వహించామని చౌమొహల్లా ప్యాలెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ముకర్రమ్ జా కుమారుడైన అజ్మత్ జా లండన్ లోనే ప్రాథమిక, ఉన్నత చదువులు చదివారు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో ఫొటోగ్రఫీలో పట్టా పొందిన ఆయన... ఫొటోగ్రఫీనే వృత్తిగా ఎంచుకున్నారు. అంతేకాదు హాలీవుడ్ లో కొన్ని సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా, సినిమాటోగ్రాఫర్ గా విధులు నిర్వహించారు. స్టీవెన్ స్పిల్ బర్గ్, రిచర్డ్ అటెన్ బరో తదితర దిగ్గజాలతో కలిసి పని చేశారు. తన తండ్రి అంత్యక్రియల కోసం హైదరాబాద్ కు వచ్చిన ఆయన ప్రస్తుతం పాతబస్తీలోని తన పూర్వికుల నివాసంలో ఉంటున్నారు.

More Telugu News