Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టు కీలక తీర్పు

  • ముగ్గుర్ని నిందితులుగా చేరుస్తూ మెమో జారీ చేసిన సిట్
  • సిట్ మెమోను కొట్టేసిన ఏసీబీ కోర్టు
  • ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు
High Court supports ACB Courts verdict in MLAs poaching case

నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఎర వేశారనే కేసులో తెలంగాణ సిట్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సిట్ వేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ముగ్గుర్నీ నిందితులుగా చేరుస్తూ సిట్ మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, తుషార్, శ్రీనివాస్ లకు మెమో ఇచ్చింది. 

అయితే ఈ ముగ్గురినీ నిందితులుగా చేర్చడాన్ని ఏసీబీ కోర్టు తోసిపుచ్చుతూ, మెమోను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టును సిట్ ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేయడాన్ని సమర్థించింది. సిట్ అప్పీలును కొట్టేస్తూ తీర్పును వెలువరించింది.

More Telugu News