All Party Meeting: రేపు టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం... వైసీపీ మినహా అన్ని పార్టీలకు ఆహ్వానం

  • అచ్చెన్నాయుడు అధ్యక్షతన అఖిలపక్షం
  • సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన బొండా ఉమ తదితరులు
  • వైసీపీ అరాచకాలపై ఫొటో ప్రదర్శన ఉంటుందన్న ఉమ
TDP will organize all party meeting

ఏపీలో మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, రేపు టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం-ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఈ సమావేశం జరుపుతున్నారు. ఈ భేటీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్యక్షత వహించనున్నారు. కాగా, ఈ అఖిలపక్ష భేటీకి అధికార వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలను ఆహ్వానించారు. 

ఈ సమావేశ ఏర్పాట్లను బొండా ఉమ, అశోక్ బాబు, టీడీ జనార్దన్ పరిశీలించారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ, వైసీపీ అరాచకాలపై ఫొటో ప్రదర్శన కూడా ఉంటుందని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వైసీపీ అరాచకాలపై న్యాయపోరాటానికి శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు.

More Telugu News