Chandrababu: నేడు ఐఎస్‌బీ ద్విదశాబ్ది వేడుకలు.. ముఖ్య అతిథిగా చంద్రబాబు

  • 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఐఎస్‌బీ
  • 1999లో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు శంకుస్థాపన
  • వేడుకల అనంతరం విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి
Chandrababu Naidu to attend ISB 20 years Function

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్‌బీ) ద్విదశాబ్ది వేడుకలు జరుపుకుంటోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ వేడుకలకు నేడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశారు. 1999లో ఐఎస్‌బీకి శంకుస్థాపన జరగ్గా 2001లో ప్రారంభమైంది.

ఇప్పుడీ బిజినెస్ స్కూల్‌కు 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలకు స్కూల్ అధికారులు చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సంస్థ ఏర్పాటులో చంద్రబాబు కృషికి గుర్తింపుగానే ఈ ఆహ్వానం లభించినట్టు తెలుస్తోంది. కాగా, వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు అనంతరం విద్యార్థులతో జరిగే ముఖాముఖిలోనూ పాల్గొంటారు.

More Telugu News