16 ఏళ్లకే పీజీ డిగ్రీ అందుకున్న నైనా జైస్వాల్ సోదరుడు
- ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్ డిగ్రీ
- 14 ఏళ్లకే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో డిగ్రీ పట్టా
- 9 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసిన అగస్త్య జైస్వాల్
తన తల్లిదండ్రులు, టీచర్ల మద్దతుతోనే తనకు ఇవి సాధ్యమైనట్టు అగస్త్య తెలిపాడు. తన తండ్రి అశ్వని కుమార్ జైస్వాల్, తల్లి భాగ్యలక్ష్మి జైస్వాల్ మద్దతు, శిక్షణతో సవాళ్లను అధిగమించినట్టు చెప్పాడు. అగస్త్య ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలను కేవలం 1.72 సెకన్లలోనే టైప్ చేయగలడు. రెండు చేతులతోనూ చక్కగా రాస్తాడు. జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ప్లేయర్. మోటివేషనల్ స్పీకర్ కూడా.