500 విమానాలు కొనుగోలు చేయనున్న ఎయిరిండియా!
- ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్
- ఎయిరిండియాను మరింత విస్తరించేందుకు నిర్ణయం
- రూ.80 వేల కోట్లతో కొత్త విమానాల కొనుగోలు
కొత్తగా కొనుగోలు చేసే విమానాల్లో 400 విమానాలు తక్కువ సీటింగ్ కలిగిన విమానాలు కాగా, మరో 100 విమానాలు భారీ సైజువి కొనుగోలు చేయనుంది. ఈ భారీ విమానాల్లో ఎయిర్ బస్ కు చెందిన ఏ350 విమానాలతో బోయింగ్ సంస్థకు చెందిన 787, 777 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మహా కొనుగోలు ఒప్పందం త్వరలోనే కార్యరూపం దాల్చనుందని విమానయాన రంగం వర్గాలు తెలిపాయి. దీనిపై ఎయిరిండియా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.