Pawan Kalyan: జనసేన ఉచిత అంబులెన్సు సర్వీసులను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • అంబులెన్సులు ఏర్పాటు చేసిన జనసేన నేత బత్తుల బలరామకృష్ణ
  • పచ్చజెండా ఊపి ప్రారంభించిన పవన్
  • రూ.30 లక్షలతో అంబులెన్సులు
  • రాజానగరం నియోజకవర్గంలో సేవలు
Pawan Kalyan inaugurates free ambulance services

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ జనసేన నేత బత్తుల బలరామకృష్ణ మూడు ఉచిత అంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ ఉచిత అంబులెన్సు సర్వీసులను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు ప్రారంభించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పచ్చజెండా ఊపి అంబులెన్స్ సర్వీసులకు ప్రారంభోత్సవం చేశారు. 

కాగా, ఈ మూడు అంబులెన్స్ లను రూ.30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. వీటిలో అత్యాధునిక వెంటిలేటర్లు, అధునాతన లైఫ్ సపోర్ట్ యంత్రాలు, 40 రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అంబులెన్సులను రాజానగరం నియోజకవర్గంలో సేవలు అందించేందుకు ఉపయోగించనున్నారు. 

అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారు ఫోన్ చేస్తే ఈ అంబులెన్సులు అందుబాటులోకి వస్తాయి. అందుకోసం ప్రత్యేక ఫోన్ నెంబరు ఏర్పాటు చేశారు.

More Telugu News