Pawan Kalyan: మంగళగిరిలో జనసేన పీఏసీ సమావేశం... హాజరైన పవన్ కల్యాణ్

  • రాజకీయ కార్యకలాపాల వేగం పెంచిన జనసేన
  • నిన్న విశాఖ నేతలో పవన్ భేటీ
  • నేడు పీఏసీ సమావేశానికి హాజరు
Pawan Kalyan attends to Janasena PAC meeting in Mangalagiri

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నేడు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. గత కొన్నివారాలుగా జరుగుతున్న సంఘటనలు, రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పీఏసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు కూడా హాజరయ్యారు. 

కాగా, పవన్ నిన్న మంగళగిరిలో విశాఖ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం తెలిసిందే. ఇటీవల హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలైన 9 మంది నేతలను, వారి కుటుంబ సభ్యులను పవన్ కలుసుకున్నారు. నేతలకు పవన్ ఆత్మీయ సత్కారం చేశారు.

More Telugu News