ప్రముఖ శైవక్షేత్రం మహానంది ఆలయంపై డ్రోన్ కలకలం

Drone flies over Mahananadi Temple
  • ఆలయం ఏరియల్ వ్యూని చిత్రీకరిస్తున్న డ్రోన్
  • గుర్తించిన ఆలయ వర్గాలు
  • వాహనంలో తప్పించుకున్న డ్రోన్ ఆపరేటర్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ వర్గాలు
ఏపీలో ప్రముఖ శైవక్షేత్రంగా అలరారుతున్న మహానంది ఆలయంపై డ్రోన్ కలకలం రేగింది. నంద్యాల సమీపంలోని ఈ ఆలయంపై ఓ డ్రోన్ సంచరించడాన్ని గుర్తించారు. డ్రోన్ ఆలయ ఏరియల్ వ్యూను చిత్రీకరిస్తుండగా ఆలయ వర్గాలు గమనించాయి. 

డ్రోన్ ను ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని గుర్తించిన సిబ్బంది, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అతడి వాహనాన్ని కారులో వెంటాడారు. ఆరు కిలోమీటర్ల వరకు ఈ చేజింగ్ సాగింది. ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ అధికారులు అతడిని పట్టుకునేందుకు విఫలయత్నం చేశారు. డ్రోన్ ఆపరేటర్ వాహనాన్ని వారు సరిగా గుర్తించలేకపోయారు. దాంతో అతడు తప్పించుకున్నాడు. 

ఈ ఘటనపై ఆలయ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సీసీ ఫుటేజిలో డ్రోన్ ఆపరేటర్ దృశ్యాలు కనిపించకపోవడంతో, పోలీసులు ఇతర మార్గాల్లో దర్యాప్తు షురూ చేశారు.
Go Back to Shorts
Mahanandi Temple
Drone
Aerial View
Police

More Telugu News