Telangana: మొక్క‌జొన్న పొత్తులు కాల్చిన వైఎస్ ష‌ర్మిల‌... ఫొటో ఇదిగో

  • ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో పాద‌యాత్ర సాగిస్తున్న ష‌ర్మిల‌
  • దేవ‌ర‌క‌ద్ర‌లో మొక్కజొన్న పొత్తులు కాల్చిన మ‌హిళా నేత‌
  • అధికారంలోకి వ‌చ్చాక‌ చిరు వ్యాపారుల‌కు కూడా అండ‌గా ఉంటామ‌ని హామీ
ys sharmila heats corn in devarakadra

ఎన్నికలు మొద‌ల‌య్యాయంటే... రాజ‌కీయ నేత‌లు లెక్క‌లేన‌న్ని చిత్రాలను చూపిస్తూ ప్ర‌చారం సాగిస్తుంటారు. ఓ నేత బ‌జ్జీలు వేస్తే... ఇంకో నేత దోశెలు వేస్తారు. ఇంకో నేత ఇస్త్రీ చేస్తే... మ‌రో నేత టీ తిర‌గ్గొడుతూ క‌నిపిస్తారు. ఇలా ఎన్నిక‌ల్లో మాత్ర‌మే క‌నిపించే ఈ చిత్రాలు... ఇప్పుడు పాద‌యాత్ర‌ల్లో భాగంగా ఎన్నిక‌లు లేని స‌మ‌యంలోనూ క‌నిపిస్తున్నాయి. ప్ర‌జా ప్రస్థానం యాత్ర పేరిట తెలంగాణ‌లో పాద‌యాత్ర చేస్తున్న వైఎస్సార్టీపీ అధినేత్రి మొక్క‌జొన్న పొత్తులు కాలుస్తూ క‌నిపించారు.

ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర‌లో భాగంగా ష‌ర్మిల ప్ర‌స్తుతం ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం ఆమె దేవ‌ర‌క‌ద్ర‌లో పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. ఈ సంద‌ర్భంగా  మొక్కజొన్న పొత్తులు విక్ర‌యిస్తున్న ఓ మ‌హిళ వ‌ద్ద కూర్చుని... నిప్పుల‌పై మొక్క‌జొన్న పొత్తుల‌ను పెట్టి కాల్చారు. 

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాప్రస్థానం సబ్బండ వర్గాల సమాహారమ‌ని పేర్కొన్నారు. యాత్ర‌లో ప్రతి ఒక్కరి బాధలు వింటామ‌న్న ష‌ర్మిల‌... అంద‌రినీ వెన్ను తట్టి భరోసా కల్పిస్తామ‌ని తెలిపారు. అధికారంలోకి వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులతో పాటు చిరు వ్యాపారులకు అండగా ఉంటామ‌ని ఆమె ప్ర‌క‌టించారు.

More Telugu News