YSRTP: 2 వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర పూర్తి చేసిన వైఎస్ ష‌ర్మిల‌... కొత్తకోట వ‌ద్ద‌ పైలాన్ ఆవిష్క‌ర‌ణ‌

  • ప్ర‌జా ప్ర‌స్థానం పేరిట యాత్ర చేస్తున్న వైఎస్ ష‌ర్మిల‌
  • కొత్త‌కోట వ‌ద్ద 2 వేల కిలోమీట‌ర్ల మైలురాయిని చేరుకున్న వైనం
  • పైలాన్ ఆవిష్క‌ర‌ణ‌కు హాజరైన వైఎస్ విజ‌య‌మ్మ‌
ys sharmila completes 2 thousend kilometers in her pada yatra

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ప్ర‌జా ప్ర‌స్థానం పేరి‌ట తెలంగాణ‌లో చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో శ‌నివారం ఓ కీల‌క ఘట్టాన్ని చేరుకున్నారు. శ‌నివారం పాల‌మూరు జిల్లా కొత్త‌కోట వ‌ద్ద ఆమె 2 వేల కిలోమీట‌ర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా కొత్త‌కోట వ‌ద్ద పైలాన్‌ను ఆమె ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ పాల్గొన్నారు. 

ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర‌లో భాగంగా తొలుత ఉమ్మ‌డి ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ జిల్లాల్లో యాత్ర‌ను పూర్తి చేసుకున్న ష‌ర్మిల‌... ఆ త‌ర్వాత ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో అడుగుపెట్టారు. పాల‌మూరు జిల్లాలోనూ ఇప్ప‌టికే 11 నియోజ‌క‌వ‌ర్గాల‌ను చుట్టేసిన ఆమె... ఉత్సాహంగా సాగుతున్నారు. కేవ‌లం 148 రోజుల్లోనే వైఎస్ ష‌ర్మిల 2 వేల కిలోమీట‌ర్ల మైలురాయిని చేరుకోవ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News