CM Jagan: అచ్యుతాపురం సెజ్ లో ఏటీసీ టైర్ల తయారీ యూనిట్ ను ప్రారంభించిన సీఎం జగన్

  • అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన
  • ఈ ఉదయం విశాఖ చేరుకున్న సీఎం
  • అక్కడ్నించి అచ్యుతాపురం పయనం
  • మరో 8 ప్రాజెక్టులకు శంకుస్థాపన
  • పారిశ్రామిక పురోగతి పట్ల హర్షం
CM Jagan inaugurates ATC Tyres unit

ఏపీ సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం విశాఖ చేరుకున్న ఆయన అక్కడ్నించి అచ్యుతాపురం సెజ్ కు తరలి వెళ్లారు. అక్కడ ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏటీసీ టైర్ల పరిశ్రమ అధికారులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. 

పరిశ్రమ లక్ష్యాలను, కంపెనీ ఉత్పత్తుల వివరాలను తెలుసుకున్నారు. అంతేకాకుండా, రూ.1000 కోట్ల విలువైన మరో 8 ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాగరతీరాన పారిశ్రామిక ప్రగతి పుంజుకుంటోందని హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News