రోజుకు 12 గంటలు డ్యూటీ చేస్తే ఇలాంటి తిండా పెట్టేది.. ఏడ్చేసిన యూపీ కానిస్టేబుల్: వీడియో వైరల్
- కానిస్టేబుల్పై క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలకు సిద్ధమైన ఉన్నతాధికారులు
- ఆయనపై 15 కేసులు ఉన్నాయన్న ఎస్పీ
- దర్యాప్తునకు ఆదేశం
ఫిరోజాబాద్లోని మెస్లో అందించే భోజనం ఏమాత్రం బాగుండడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కానిస్టేబుళ్లకు పోషకాహారం కోసం రూ. 1,875 ఇస్తామన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఏమైందని ప్రశ్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. క్రమశిక్షణ రాహిత్యం, విధులకు గైర్హాజరు సహా మనోజ్పై మొత్తం 15 కేసులు పెండింగులో ఉన్నాయన్న సీనియర్ ఎస్పీ ఆశిష్ తివారీ దర్యాప్తునకు ఆదేశించారు.