ముగిసిన ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌... 93 శాతం పోలింగ్ న‌మోదు

polling for vice presidential candidate concludes
భార‌త ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ శ‌నివారం సాయంత్రం స‌రిగ్గా 5 గంట‌ల‌కు ముగిసింది. పార్ల‌మెంటులోని ఉభ‌య స‌భ‌ల సభ్యులు ఈ ఎన్నిక‌ల్లో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌లో కేవ‌లం 93 శాతం (725) మంది ఎంపీలు మాత్ర‌మే ఓటేసిన‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. పోలింగ్ పూర్తయిన నేప‌థ్యంలో మ‌రికాసేప‌ట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ రాత్రికే ఫ‌లితం కూడా వెల్ల‌డి కానుంది.

ఉపరాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ అభ్య‌ర్థిగా ప‌శ్చిమ బెంగాల్ మాజీ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌డ్‌, విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా మార్గ‌రెట్ అల్వా పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టిదాకా ఉన్న అంచ‌నాల ప్ర‌కారం ఈ ఎన్నిక‌ల్లో అధికార కూట‌మి అభ్య‌ర్థి ధ‌న్‌క‌డే విజ‌యం సాధించే అవ‌కాశాలున్నాయి. అధికార ఎన్డీఏతో పాటు ప‌లు ఇత‌ర పార్టీలు కూడా ధ‌న్‌క‌డ్ ‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి.
Go Back to Shorts
Vice President
Jagdeep Dhankhar
Margaret Alva
NDA

More Telugu News