కామన్వెల్త్ క్రీడల క్రికెట్: టీమిండియా స్కోరు 164/5... లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ మహిళల దూకుడు
- బర్మింగ్ హామ్ లో మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు
- వేగంగా ఆడిన స్మృతి మంధన
- రాణించిన జెమీమా
అనంతరం జెమీమా రోడ్రిగ్స్ 44, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 20, దీప్తి శర్మ 22 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రేయా కెంప్ 2, కాథరిన్ బ్రంట్ 1, కెప్టెన్ నటాలీ సివర్ 1 వికెట్ తీశారు.
లక్ష్యఛేదనను ఇంగ్లండ్ దూకుడుగా ఆరంభించింది. 2 ఓవర్లలోనే 24 పరుగులు చేసింది. అయితే, మూడో ఓవర్లో ఇంగ్లండ్ దూకుడుకు అడ్డుకట్ట పడింది. ఓపెనర్ సోఫీ డన్ క్లేను దీప్తి శర్మ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. డన్ క్లే 10 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 42 పరుగులు. క్రీజులో ఓపెనర్ డానియెల్లే వ్యాట్ (20 బ్యాటింగ్), అలిస్ కాప్సే ఉన్నారు.