Bandi Sanjay: పాదయాత్రకు విరామం ప్రకటించి.. ఢిల్లీకి బయల్దేరుతున్న బండి సంజయ్

Bandi Sanjay going to Delhi
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. కాసేపట్లో ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసే అవకాశం ఉంది. 

ఈనెల 21న మునుగోడులో బహిరంగసభ, పాదయాత్ర ముగింపు సభలకు వీరిద్దరినీ ఆయన ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను బీజేపీ అగ్రనేతలకు ఆయన వివరించనున్నారు.
Go Back to Shorts
Bandi Sanjay
BJP
Delhi
Amit Shah
JP Nadda

More Telugu News