Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రలో సరికొత్త రికార్డ్

  • 22 రోజుల్లో 2,94,040 మందికి దర్శనం
  • గతేడాది కంటే ఇది ఎక్కువ
  • ఆగస్ట్ 15 వరకు కొనసాగనున్న యాత్ర
In 22 days pilgrim numbers break last year 60 day long Amarnath Yatra record

ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రలో మొదటి 22 రోజులకే రికార్డ్ నమోదైంది. 2,94,040 మంది హిమ శివలింగాన్ని దర్శించుకున్నారు. గతేడాది 60 రోజుల యాత్ర పొడవునా దర్శించుకున్న వారి సంఖ్య 2.85 లక్షల కంటే ఇది ఎక్కువ. అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది 46 రోజుల పాటు సాగనుంది. ఈ ఏడాది మొత్తం మీద దర్శించుకునేవారి సంఖ్య, ఇటీవలి సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుందని అమర్ నాథ్ ష్రైన్ బోర్డ్ ప్రకటించింది. 

ఈ ఏడాది 26 రోజుల పాటు సాగే యాత్ర ఆగస్ట్ 15తో ముగియనుంది. 2015లో 3,52,771 మంది, 2016లో 3,20,490 మంది అమర్ నాథ్ గుహను దర్శించుకున్నారు. 2017లో అమర్ నాథ్ గుహను సందర్శించిన వారి సంఖ్య 2,60,003గా ఉంది. ఈ ఏడాది యాత్ర ముగిసే నాటికి సందర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా ఉండనుందని తెలుస్తోంది. 4,700 మందితో కూడిన తాజా బృందం భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి అమర్ నాథ్ గుహ దిశగా ప్రయాణమై వెళ్లింది.

More Telugu News