Pant: టీమిండియాను ఆదుకున్న పంత్, హార్దిక్ జోడీ

  • టీమిండియా, ఇంగ్లండ్ మధ్య చివరి వన్డే
  • 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
  • టీమిండియా టార్గెట్ 260 రన్స్
  • 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా
Pant and Hardik saves India

చివరి వన్డేలో టీమిండియా లక్ష్యఛేదనలో ఓ దశలో 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా జోడీ ఆదుకుంది. వీరిద్దరూ అర్ధసెంచరీలు సాధించడంతో టీమిండియా ఛేదనలో మళ్లీ రేసులోకి వచ్చింది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో టీమిండియా 33 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. ప్రస్తుతం పంత్ 65, పాండ్యా 57 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఇంకా 17 ఓవర్లలో 81 పరుగులు చేయాలి. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లే 3 వికెట్లు తీయగా, ఓవర్టన్ 1 వికెట్ తీశాడు.

More Telugu News