పన్నీర్ సెల్వంకు మరో షాక్ ఇచ్చిన పళనిస్వామి

Palaniswami suspends Panneerselvam sons
  • ఇటీవలే పన్నీర్ సెల్వంపై వేటు వేసిన పళనిస్వామి
  • ఇప్పుడు ఆయన కుమారులను కూడా సస్పెండ్ చేసిన వైనం
  • పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారన్న పళని
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు సొంత పార్టీ అన్నాడీఎంకేలో వరుస షాక్ లు తగులుతున్నాయి. పన్నీర్ పై అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఇప్పటికే వేటు వేశారు. తాజాగా ఆయన మరో షాకిచ్చారు. పన్నీర్ సెల్వం కుమారులు సహా మరో 16 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా పళనిస్వామి మాట్లాడుతూ, వీరంతా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. 

ఈ కారణం వల్లే వీరి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇటీవల జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. దీంతో, పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతుల్లోకి వెళ్లిపోయాయి. వెంటనే పన్నీర్ సెల్వంను పార్టీ పదవులతో పాటు, సభ్యత్వం నుంచి కూడా తొలగించారు.
Go Back to Shorts
Edappadi Palaniswami
Panneerselvam
Tamil Nadu

More Telugu News