Prime Minister: కాన్వాయ్ ఆపి.. బాలిక గీసిన త‌న త‌ల్లి పెయింటింగును తీసుకున్న మోదీ... వీడియో ఇదిగో

  • హిమాచ‌ల్ టూర్ వెళ్లిన మోదీ
  • జ‌న స‌మూహంలో మోదీ త‌ల్లి పెయింటింగ్‌తో బాలిక‌
  • కాన్వాయ్ ఆపి మ‌రీ బాలిక వ‌ద్ద‌కు వ‌చ్చిన మోదీ
  • త‌ల్లి పెయింటింగ్‌ను తీసుకుని బాలిక‌ను ఆశీర్వ‌దించిన మోదీ
pm modi stopped his car to accept the painting from a girl in Shimla

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం నాటి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ పర్య‌ట‌న‌లో భాగంగా ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాజ‌ధాని సిమ్లాలో రోడ్డుకు ఇరువైపులా నిల‌బ‌డ్డ జ‌నానికి అభివాదం చేస్తూ స్పీడుగా సాగుతున్న మోదీ... ఓ చోట ఉన్న‌ట్టుండి త‌న కాన్వాయ్‌ను ఆపారు. ఆ త‌ర్వాత కారులో నుంచి దిగిన మోదీ.. ఆ జ‌న స‌మూహంలో బారీకేడ్ల‌కు ఆవ‌ల నిలుచున్న ఓ బాలిక వ‌ద్ద‌కు వెళ్లారు. 

ఆ బాలిక చేతిలోని పెయింటింగ్‌ను తీసుకున్నారు. బారీకేడ్ల‌కు ఆవ‌లే నిలుచుండి మ‌రీ మోదీ కాళ్ల‌కు ఆ బాలిక న‌మ‌స్క‌రిస్తే... మోదీ ఆ బాలిక‌ను ఆశీర్వ‌దించారు. ఇంత‌కీ ఆ బాలిక గీసిన పెయింటింగ్ ఎవ‌రిదో తెలుసా? మోదీ మాతృమూర్తిది. కాన్వాయ్‌లో స్పీడుగా వెళుతున్న మోదీ... త‌న త‌ల్లి పెయింటింగ్ చూడ‌గానే త‌న కాన్వాయ్‌ని నిలిపేయ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News