Rajya Sabha: 16 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ... కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్

  • రాజ్యసభలో 57 ఖాళీలు
  • జూన్ 10న ఎన్నికలు
  • వివిధరాష్ట్రాల నుంచి బరిలో దించుతున్న బీజేపీ
BJP announced candidates for Rajyasabha elections

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 16 రాజ్యసభ స్థానాలకు నేడు తన అభ్యర్థులను ప్రకటించింది. వివిధ రాష్ట్రాల నుంచి తన అభ్యర్థులను బరిలో దించుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. మరో కేంద్రమంత్రి పియూష్ గోయల్ కు మహారాష్ట్ర నుంచి అవకాశం లభించింది. రాజ్యసభలో ఖాళీ అయిన 57 స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి.


బీజేపీ అభ్యర్థుల జాబితా...

నిర్మలా సీతారామన్- కర్ణాటక
జగ్గేష్- కర్ణాటక
పియూష్ గోయల్- మహారాష్ట్ర
అనిల్ సుఖ్ దేవ్ రావ్ బోండే- మహారాష్ట్ర
కవితా పాటిదార్- మధ్యప్రదేశ్
ఘనశ్యామ్ తివారీ- రాజస్థాన్
లక్ష్మీకాంత్ వాజ్ పేయి- ఉత్తరప్రదేశ్
రాధామోహన్ అగర్వాల్- ఉత్తరప్రదేశ్
సురేంద్ర సింగ్ నాగర్- ఉత్తరప్రదేశ్
బాబూరామ్ నిషాద్- ఉత్తరప్రదేశ్
దర్శనా సింగ్- ఉత్తరప్రదేశ్
సంగీతా యాదవ్- ఉత్తరప్రదేశ్
కల్పనా సైనీ- ఉత్తరాఖండ్
సతీష్ చంద్ర దూబే- బీహార్
శంభు శరణ్ పటేల్- బీహార్
క్రిషన్ లాల్ పన్వర్- హర్యానా

More Telugu News