Andhra Pradesh: కుమారుడి మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌

  • ఎన్టీఆర్ జిల్లా చిన నందిగామ‌లో ఘ‌ట‌న‌
  • ట్రాక్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన కుమారుడు జ‌గ‌దీశ్
  • అత‌డు లేడ‌న్న వేద‌న‌తో ఉరేసుకున్న‌ సాంబ‌శివ‌రావు, విజ‌య‌ల‌క్ష్మి
couple hanged to death in the wake their son demise

ఏపీలో ఆదివారం ఓ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. కుమారుడి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక దంప‌తులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండ‌లం చిన నందిగామ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇటీవ‌లే కుమారుడి మృతి, తాజాగా అత‌డి త‌ల్లిదండ్రుల బ‌ల‌వ‌న్మ‌ర‌ణంతో గ్రామంలో విషాద ఛాయ‌లు అల‌ముకున్నాయి.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... చిన నందిగామ‌కు చెందిన దంప‌తులు సాంబ‌శివ‌రావు, విజ‌య‌ల‌క్ష్మి దంప‌తుల‌కు జ‌గ‌దీశ్ అనే కుమారుడు ఉన్నాడు. ఇటీవ‌లే ట్రాక్ట‌ర్ ఢీకొన్న ప్ర‌మాదంలో జ‌గ‌దీశ్ మ‌ర‌ణించాడు. అప్ప‌టి నుంచి తీవ్ర ఆవేద‌న‌లో కూరుకుపోయిన సాంబ‌శివ‌రావు, విజ‌య‌ల‌క్ష్మి కుమారుడు లేనిదే బ‌త‌క‌లేనంత‌గా మారిపోయారు. ఈ క్ర‌మంలోనే వారిద్ద‌రూ ఆదివారం వారి ఇంటిలోనే ఉరేసుకుని చ‌నిపోయారు.

More Telugu News