వివేకా హత్య కేసు నిందితుల బెయిల్పై హైకోర్టు నిర్ణయం వాయిదా
- బెయిల్ కోరుతూ ముగ్గురు నిందితుల పిటిషన్
- చార్జి షీటు దాఖలైనందున బెయిల్ ఇవ్వాలన్న పిటిషనర్లు
- సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీబీఐ తరఫు న్యాయవాది
- తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసిన హైకోర్టు
ఈ కేసులో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిందని, ఈ సమయంలో నిందితులకు బెయిల్ ఇస్తే కేసు ఎలాంటి ప్రభావితం అయ్యే అవకాశాలు లేవని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు.
ఈ సమయంలో జోక్యం చేసుకున్న కోర్టు... కేసు దర్యాప్తునకు ఇంకెంత సమయం పడుతుందని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారులను అడిగి వివరాలను కోర్టుకు తెలియజేస్తామని సీబీఐ లాయర్ కోర్టుకు విన్నవించారు. దీంతో నిందితుల బెయిల్పై నిర్ణయాన్ని కోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది.