CPI Narayana: నారాయ‌ణ ఇంటికి విజయసాయిరెడ్డి... సీపీఐ నేత అర్ధాంగికి నివాళి

  • అనారోగ్యంతో గురువారం నారాయ‌ణ భార్య వసుమతి మృతి
  • జాబ్ మేళా ఏర్పాట్ల ప‌రిశీల‌న కోసం తిరుప‌తికి వచ్చిన సాయిరెడ్ది
  • వసుమతికి నివాళి అర్పించిన వైసీపీ నేత‌
vijay sai reddy tributes to cpi narayana wife

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ ఇంటికి వైసీపీ ప్రధాన కార్య‌ద‌ర్శి, వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి వెళ్లారు. రాజ‌కీయంగా నిత్యం విమ‌ర్శ‌లు సంధించుకునే ఈ ఇద్ద‌రు నేత‌లు క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. నారాయ‌ణ భార్య వ‌సుమ‌తి దేవి గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో గురువారం మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.

శ‌నివారం నుంచి తిరుప‌తిలో వైసీపీ నిర్వ‌హిస్తున్న జాబ్ మేళా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించేందుకు సాయిరెడ్డి శుక్ర‌వారం తిరుప‌తి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా సీపీఐ నేత ఇంటికి వెళ్లారు. వసుమతిదేవి‌ పార్థివ దేహానికి నివాళులర్పించారు. నారాయణ, ఆయన కుటుంబ సభ్యులను సాయిరెడ్డి ప‌రామ‌ర్శించారు.

More Telugu News