భారత్ పైకి మిస్సైల్ ప్రయోగించేందుకు పాకిస్థాన్ సిద్ధమయిందట..!
- ఇటీవల పొరపాటున పాక్ భూభాగంపై పడిన భారత్ మిస్సైల్
- ప్రతీకార చర్యకు దిగాలనుకున్న పాకిస్థాన్
- సంచలన కథనాన్ని ప్రచురించిన బ్లూమ్ బర్గ్
క్షిపణి ప్రయోగం కోసం ప్రణాళికలను కూడా పాకిస్థాన్ రూపొందించిందట. అయితే, ఒకవేళ క్షిపణిని ప్రయోగిస్తే జరగబోయే పరిణామాలపై ఓ ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత... మిస్సైల్ ప్రయోగ నిర్ణయంపై వెనక్కి తగ్గిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసినట్టు బ్లూమ్ బర్గ్ పేర్కొంది. అయితే ఈ వార్తపై అటు పాకిస్థాన్ కానీ, ఇటు ఇండియా కానీ స్పందించలేదు.