పాక్ భూభాగంపైకి దూసుకుపోయిన భారత క్షిపణి ఘటనపై అమెరికా స్పందన!

America response on Indian missile hitting Pakistan land
  • మార్చి 9వ తేదీన పాక్ భూభాగంపై పడిన మిస్సైల్
  • ఈ ఘటన పొరపాటుగానే జరిగిందని చెప్పిన అమెరికా
  • భారత్ కూడా వివరణ ఇచ్చిందని వ్యాఖ్య
భారత్ కు చెందిన ఒక మిస్సైల్ పొరపాటున పాకిస్థాన్ భూభాగంపై పడిన సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు దీనిపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. పొరపాటుగానే ఈ ఘటన జరిగిందని వ్యాఖ్యానించింది. భారత్ చెప్పినట్టుగా ఈ ఘటన పొరపాటుగానే జరిగిందని, అంతకు మించి దీని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ఈ ఘటనపై ఈనెల 9న భారత్ వివరణ ఇచ్చిందని... అందువల్ల దీనిపై తాము ఇంతకు మించి స్పందించలేమని చెప్పారు. 

మార్చి 9న ఈ ఘటన సంభవించిన సంగతి తెలిసిందే. ఒక క్షిపణికి సాధారణ తనిఖీలను నిర్వహిస్తున్న సమయంలో ప్రమదవశాత్తు అది గాల్లోకి లేచింది. దూసుకెళ్లి పాకిస్థాన్ భూభాగంపై పడింది. అయితే దానికి వార్ హెడ్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేయగా... భారత రక్షణశాఖ వివరణ ఇచ్చింది. జరిగిన ఘటనపై విచారణ వ్యక్తం చేసింది. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఇప్పటికే ఆదేశించామని చెప్పింది.
Go Back to Shorts
India Missile
Pakistan
USA

More Telugu News