ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు వీస్తున్నాయని వివరించారు. అంతేగాక, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణం వేడెక్కిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఈ నేపథ్యంలో వాతావరణ అనిశ్చితి నెలకొనడంతో అక్కడక్కడా మేఘాలు ఆవరించాయని వివరించారు. ఈ ప్రభావంతోనే రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఈ నేపథ్యంలో వాతావరణ అనిశ్చితి నెలకొనడంతో అక్కడక్కడా మేఘాలు ఆవరించాయని వివరించారు. ఈ ప్రభావంతోనే రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.