మధుమేహ రోగులకు శుభవార్త.. దేశంలో అందుబాటులోకి ఓరల్ ట్యాబ్లెట్ ‘సెమాగ్లూటైడ్’
- ఇప్పటి వరకు ఇంజెక్షన్ల రూపంలో మాత్రమే అందుబాటులో
- అధిక బరువును తగ్గించడంలోనూ కీలక పాత్ర
- ఇంజెక్షన్ రూపం నుంచి ట్యాబ్లెట్గా మార్చేందుకు 15 ఏళ్లు
ఈ ఔషధంపై భారత్ సహా పలు దేశాల్లో 10 ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టు తెలిపింది. ట్రయల్స్లో పాల్గొన్న వారిలో 1000 మందికిపైగా భారతీయులేనని పేర్కొంది. అమెరికాలో ఈ ట్యాబ్లెట్కు 2019లోనే ఆమోదం లభించగా, భారత్లో డిసెంబరు 2020లో ఆమోదం లభించింది. కాగా, ఇప్పటి వరకు ఇంజెక్షన్ల రూపంలో ఉన్న సెమాగ్లూటైడ్ను ట్యాబ్లెట్ రూపంలో తీసుకొచ్చేందుకు నోవా నోర్డిస్క్ సంస్థకు 15 సంవత్సరాలు పట్టడం గమనార్హం.