శ్రీనగర్ లో ఉగ్రదాడి... ఇద్దరు పోలీసుల మృతి
- కశ్మీర్ లోయలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
- శ్రీనగర్ శివార్లలో ఓ పోలీస్ బస్సుపై దాడి
- క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన అధికారులు
- దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం వేట
ఘటనపై సమాచారం అందుకున్న సాయుధ బలగాలు వెంటనే ఆ ప్రదేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి.
కొన్నిరోజుల కిందట కూడా ఇదే తరహాలో ఓ పోలీస్ బస్సుపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. డిసెంబరు 10న బందిపొరా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మరణించారు. ఇటీవల కశ్మీర్ లోయలో వలస కూలీలపై జరిగిన దాడుల తర్వాత ఉగ్రవాదులు పోలీస్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది.