శ్రీనగర్ లో ఉగ్రదాడి... ఇద్దరు పోలీసుల మృతి

Terror attack  in Jammu Kashmir
  • కశ్మీర్ లోయలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
  • శ్రీనగర్ శివార్లలో ఓ పోలీస్ బస్సుపై దాడి
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన అధికారులు
  • దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం వేట
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. శ్రీనగర్ శివార్లలోని జెవాన్ ప్రాంతంలో ఓ పోలీస్ బస్సుపై ఉగ్రవాదులు భారీగా కాల్పులకు తెగబడ్డారు. పోలీస్ శిబిరానికి సమీపంలోని పంతా చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించారు.

ఘటనపై సమాచారం అందుకున్న సాయుధ బలగాలు వెంటనే ఆ ప్రదేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి.

కొన్నిరోజుల కిందట కూడా ఇదే తరహాలో ఓ పోలీస్ బస్సుపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. డిసెంబరు 10న బందిపొరా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మరణించారు. ఇటీవల కశ్మీర్ లోయలో వలస కూలీలపై జరిగిన దాడుల తర్వాత ఉగ్రవాదులు పోలీస్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Terror Attack
Zewan
Srinagar
Police
Jammu And Kashmir

More Telugu News