Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

  • కొత్త‌గా 10,853 క‌రోనా కేసులు
  • నిన్న 526 మంది మృతి
  • మొత్తం 4,60,791 మంది మృతి
  • 1,08,21,66,365 డోసుల వ్యాక్సిన్ వినియోగం
corona bulletin in india

దేశంలో కొత్త‌గా 10,853 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 12,432 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని తెలిపింది. ప్ర‌స్తుతం దేశంలో 1,44,845 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు.

క‌రోనాతో నిన్న 526 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,37,49,900 మంది కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల దేశంలో మొత్తం 4,60,791 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న దేశ వ్యాప్తంగా 28,40,174  డోసుల క‌రోనా వ్యాక్సిన్ వినియోగించారు. మొత్తం 1,08,21,66,365 డోసుల వ్యాక్సిన్లు వాడారు.

More Telugu News