Corona Virus: దేశంలో కరోనా కేసుల తాజా వివ‌రాలు

  • కొత్త‌గా 12,729 క‌రోనా కేసులు
  • 221 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,59,873
corona bulletin in inida

దేశంలో కరోనా కేసుల తాజా వివ‌రాల‌ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దీని ప్ర‌కారం నిన్న దేశంలో కొత్త‌గా 12,729 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 221 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న క‌రోనా నుంచి 12,165 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,48,922 మంది చికిత్స తీసుకుంటున్నారు.

క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,37,24,959 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,59,873గా ఉంది. నిన్న దేశంలో 5,65,276 వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,07,70,46,116 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు.

More Telugu News