Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్

  • కొత్త‌గా 12,885 క‌రోనా కేసులు
  • నిన్న‌ 461 మంది మృతి
  • మొత్తం మ‌ర‌ణాల సంఖ్య‌ 4,59,652
  • నిన్న 30,90,920  వ్యాక్సిన్ డోసుల వినియోగం
corona bulletin in inida

దేశంలో కొత్త‌గా 12,885 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న క‌రోనా నుంచి 15,054 మంది కోలుకున్నారు. అలాగే, క‌రోనా వ‌ల్ల‌ 461 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్ర‌స్తుతం 1,48,579 మంది ఆసు‌ప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం 3,37,12,794 మంది కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల మొత్తం 4,59,652 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నిన్న 30,90,920 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,07,63,14,440కు పెరిగింది.

More Telugu News