Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

  • కొత్త‌గా 14,313 మందికి క‌రోనా
  • క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,42,60,470
  • నిన్న‌ 549 మంది మృతి
  •  మృతుల సంఖ్య మొత్తం  4,57,740
corona bulletin in inida

దేశంలో కొత్త‌గా 14,313 మందికి క‌రోనా నిర్ధార‌ణ అయింది. నిన్న క‌రోనా వ‌ల్ల 549 మంది మరణించినట్టు న‌మోదైంది. మ‌రో 13,543 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,36,41,175కు చేరింది. దేశంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,61,555 మంది క‌రోనాకు చికిత్స తీసుకుంటున్నారు.

క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,42,60,470కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,57,740కు పెరిగింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 60,70,62,619 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

More Telugu News