Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

  • కొత్త‌గా 14,348 క‌రోనా కేసులు
  • నిన్న‌ 805  మంది మృతి
  • కేసుల సంఖ్య మొత్తం 3,42,46,157
  • యాక్టివ్ కేసులు 1,61,334  
corona bulletin in inida

దేశంలో కొత్త‌గా 14,348 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా నుంచి నిన్న‌ 13,198 మంది కోలుకున్నారు. అలాగే, నిన్న‌ 805  మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య మొత్తం 3,42,46,157కు చేరింది. యాక్టివ్ కేసులు 1,61,334 ఉన్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,36,27,632 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,57,191గా ఉంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,04,82,00,966 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. కేర‌ళ‌లో నిన్న 7,838 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఆ రాష్ట్రంలో నిన్న‌ 90 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News