Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివరాలు

  • దేశంలో కొత్త‌గా 16,156 క‌రోనా కేసులు
  • నిన్న‌ 733 మంది మృతి
  • మొత్తం మృతుల సంఖ్య 4,56,386
  • నిన్న 49,09,254 వ్యాక్సిన్ డోసుల వినియోగం
corona bulletin in inida

దేశంలో కొత్త‌గా 16,156 క‌రోనా కేసుల నిర్ధార‌ణ అయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. అలాగే, 733 మంది క‌రోనాతో నిన్న ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,60,989 మంది చికిత్స తీసుకుంటున్నారు.

ఇక నిన్న క‌రోనా నుంచి 17,095 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 3,36,14,434కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 4,56,386కు చేరింది. నిన్న 49,09,254 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,04,04,99,873 వ్యాక్సిన్ డోసులు వేశారు.

More Telugu News