Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

  • కొత్త‌గా 15,906 మందికి క‌రోనా నిర్ధార‌ణ
  • కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,35,48,605
  • నిన్న క‌రోనాతో 561 మంది మృతి
  • క‌రోనా మృతుల సంఖ్య మొత్తం 4,54,269
corona bulletin in inida

దేశంలో కొత్త‌గా 15,906 మందికి క‌రోనా నిర్ధార‌ణ అయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం దేశంలో 1,72,594 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో క‌రోనాకు చికిత్స తీసుకుంటున్నారు. నిన్న 16,479 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,35,48,605కి చేరింది.  

నిన్న క‌రోనాతో 561 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా మృతుల సంఖ్య మొత్తం 4,54,269కి చేరింది. నిన్న 77,40,676 డోసుల వ్యాక్సిన్లు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు వినియోగించిన మొత్తం డోసుల సంఖ్య 1,02,10,43,258కి చేరింది.

More Telugu News