KTR: రాయచూర్‌ను తెలంగాణలో కలపాలన్న బీజేపీ ఎమ్మెల్యే.. అభివృద్ధికి నిదర్శనమన్న కేటీఆర్

  • బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యల వీడియోను కేటీఆర్‌కు ట్వీట్ చేసిన నెటిజన్
  • కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనమన్న కేటీఆర్
  • గతంలో నాందేడ్ నాయకులు కూడా ఇలాంటి డిమాండే చేశారన్న మంత్రి
Karnataka BJP MLA says Raichur should be merged in Telangana

కర్ణాటకలోని రాయచూర్‌ను తెలంగాణలో కలపాలని కోరుతుండడం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాయచూర్‌ను తెలంగాణలో కలపాలంటూ బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఓ నెటిజన్ కేటీఆర్‌కు పంపారు.

దీనిపై స్పందించిన కేటీఆర్ ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి, ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనమని ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే కోరికను అక్కడి ప్రజలు సైతం కరతాళ ధ్వనులతో స్వాగతించారని పేర్కొన్నారు. గతంలో మహారాష్ట్రలోని నాందేడ్ నాయకులు కూడా ఇలాంటి డిమాండే చేసినట్టు ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.

More Telugu News