Pawan Kalyan: పోసాని భార్యకు దారుణ అవమానం.. పవన్ కల్యాణ్ దాడులు సాగబోవన్న లక్ష్మీపార్వతి

  • మహిళలను కించపరిచే స్థాయికి దిగజారారు
  • చంద్రబాబు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు
  • విలువలకు తిలోదకాలిచ్చారని మండిపాటు
Lakshmi Parvathi Criticizes Pawan Kalyan

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై లక్ష్మీపార్వతి మండిపడ్డారు. పోసాని భార్యకు దారుణమైన అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే స్థాయికి టీడీపీని దిగజార్చారన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దిగజార్చిన హీనుడు చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు వారసత్వాన్ని లోకేశ్, పవన్ కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువలకు తిలోదకాలిచ్చారన్నారు. మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తూ పవన్ కల్యాణ్ సాగిస్తున్న దాడులు ఇక ఎంతోకాలం సాగబోవన్నారు.

More Telugu News